ఏ దేశానికీ లేని శుభవార్త ఇండియా కి ..!

                      ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు అగ్రరాజ్యాలు అని చెప్పుకున్న దేశాలు ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకికనుమరుగవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ కరోనా వైరస్ విషయంలో ఒక్క భారతదేశం మినహా మిగతా దేశాలు ఎదుర్కొనలేక పోతున్నాయి అని తెలిపింది. దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ అనే నిర్ణయం చాలా మంచిదని భారతీయులకి మంచి ఐకమత్యం ఉందని మరోసారి రుజువైందని W.H.O తెలిపింది.ముఖ్యంగా భారతీయులకు కరోనా వైరస్ విషయంలో వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా సామాజిక దూరం బాగా పాటిస్తున్నారని తెలిపింది. ఇదే టైమ్ లో దేశంలో కూడా కరోనా వైరస్ వ్యాధి నిర్మూలనకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడానికి బెంగుళూరుకు చెందిన ఒకరు మరియు హైదరాబాద్ కి చెందిన ఒక ప్రొఫెసర్ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చి దానికి అనుమతి రావటం కోసం కృషి చేస్తున్నారు.


    కచ్చితంగా బయటికి వస్తున్న సమాచారం ప్రకారం ఈ రెండింటిలో ఒకటి సత్ఫలితాలు ఇవ్వటం గ్యారెంటీ అనే టాక్ బలంగా వినబడుతోంది. మొత్తంమీద చూసుకుంటే కరోనా వైరస్ విషయంలో ప్రపంచంలో ఏ దేశ ప్రజలు ఎదుర్కొనే విధంగా ఇండియన్ బాగా ఎదుర్కొనటం తో ఇండియా పేరు ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో భారీ గా వినబడుతోంది. ఇదే సమయంలో మనవాళ్లు అందుబాటులోకి తెచ్చిన రెండు వ్యాక్సిన్ లలో ఒకటి ఓకే అయితే ఇండియాకి శుభవార్తే అని అంటున్నారు చాలామంది.


    కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేయకపోతే.. దాన్ని నాశనం చేయడం ఒక్కటే మార్గం.. అది కూడా పూర్తి లాక్ డౌన్ ద్వారా.. వైరస్ వ్యాప్తి చెయిన్‌ను బ్రేక్ చేస్తేనే.. ఆ వైరస్ నశిస్తుంది.. లేదంటే.. ప్రపంచం మొత్తానికి కరోనా వస్తుంది.. ఈ క్రమంలో జనాలకు వైద్యం చేసేందుకు వైద్యులు, సదుపాయాలు, సిబ్బంది ఉండరు. దాంతో అన్ని దేశాల ప్రభుత్వాలు చేతులెత్తేస్తాయి. అప్పుడు మానవ వినాశనానికి పరిస్థితులు దారి తీస్తాయి. కొంత కాలానికి భూమిపై మనుషులు అన్నవారు లేకుండా పోతారు. ప్రపంచం మొత్తం అంతమైపోతుంది. కానీ.. అలాంటి స్థితి రాకుండా ఉండాలనే.. ఇప్పుడు మనమందరం కోరుకునేది.