నిర్భయ దోషులకు రేపే ఉరి!!!

 



    నిర్భయ కేసులో తీ హార్ జైలు  లో శిక్ష అనుభవిస్తున్న నలుగురికి ఉరి శిక్ష రేపే. నిర్భయ కేసులో  తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులు ఒకరైన పవన్ గుప్తా ఉరిశిక్షకు ఒక్కరోజు ముందు పెట్టుకున్న, పిటిషన్ను గురువారం సుప్రీంకోర్టు కొట్టేసింది .2012లో నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు తాను  మైనర్ అయినందున ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని పవన్ గుప్తా తన పిటిషన్లో కోరాడు, కాగా నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను ఢిల్లీలోలేనంటూ  నిన్న  దోషి ముఖేష్ పెట్టుకున్న పిటిషన్ సైతం ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే.


     ఈ తీర్పుపై నిర్భయ తల్లి ఆశా దేవి మాట్లాడుతూ ,కోర్టు ఇప్పటికే వాళ్లకు చాలా అవకాశం ఇచ్చింది సరిగ్గా ఉరిశిక్ష అమలుకు ముందు వాళ్లు ఏదో ఒక వాదన తీసుకొచ్చి వాయిదా వేయించుకున్నారు. వాళ్ల యుక్తుల గురించి కోర్టులకు కూడా అవగాహన వచ్చింది, రేపు నిర్భయ దోషులకు  ఉరిశిక్ష అమలు చేసి నిర్భయకు న్యాయం జరుగుతుందని ఆశా దేవి తెలిపారు.ఉరి సమయంలోఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్ధారించుకునేందుకు డమ్మీ ట్రయల్.


     మార్చి 20 తేది ఉదయం 5 30 నిమిషాలకు నిందితులకు ఉరి తీయాలని, ఈ నెల 5న  పటియాల కోర్ట్ నాలుగోసారి కొత్త డెత్ వారెంట్ జారీ చేసిన ది అందరికీ తెలిసిందే. బుధవారం తీహార్  జైలు ప్రాంగణంలో మరోసారి  డమ్మీ ట్రైల్ జరిగినట్లు తీహార్ జైలు అదనపు ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ తెలిపారు. జైలు నెంబర్ త్రీ  గదిలో జైలు అధికారుల సమక్షంలో దీన్ని నిర్వహించామని ఉరిశిక్ష అమలుకు ముందు ఇలాంటివి సాధారణమైన ని వి అని ఏదో అద్వితీయమైన వండర్ జరిగితే తప్ప ఆల్మోస్ట్ రేపు ఉదయం ఉరి కన్ఫామ్.