కరోనానివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష!


      అమరావతి:- రాష్ట్రంలో కోవిడ్‌ –19 నివారణా చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష.కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా నిబంధనలు అమలు చేయాలని సీఎం స్పష్టీకరణ.వివిధ సెంటర్ల నుంచి క్వారంటైన్‌ పూర్తిచేసుకున్న వారిని ఇంటికి పంపేటప్పుడు బీదలకు రూ.2వేల రూపాయలు ఇవ్వాలని సీఎం ఆదేశం.ముందుజాగ్రత్త చర్యగా వారిని మనం క్వారంటైన్లో పెడుతున్నాం.తిరిగి ఇంటికి పంపించినప్పుడు రూ. 2వేల డబ్బు చేతిలో పెట్టాలి.పౌష్టికాహారం తీసుకోవాలని వారికి సూచనలు చేయాలి.


      లేదంటే, మళ్లీ సమస్య మొదటికి వచ్చే ప్రమాదం ఉంటుంది.క్వారంటైన్‌నుంచి ఇంటికి పంపేటప్పుడు వారికి సూచనలు చేయాలి.మనం ఇచ్చే డబ్బు ద్వారా పాలు, గుడ్డు, కూరగాయలు లాంటి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.ఇలా చేయడం సమాజానికి కూడా మంచిది,అన్నిరోజులు క్వారంటైన్‌లో పెట్టి ఒకేసారి మనం ఇంటికి పంపితే, పస్తు ఉండే పరిస్థితి ఉండకూడదు.క్వారంటైన్లలో సదుపాయాలపై నిరంతరం దృష్టిపెట్టాలి:సీఎంమాస్క్‌ల తయారీని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలి.మొదటి హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో మాస్క్‌లను పంపిణీచేయాలి.


    ప్రతి మనిషికి , మూడు మాస్క్‌లు పంపిణీ.రేపటి నుంచి డెలివరీ ప్రారంభిస్తామన్న అధికారులు.రెండు మూడురోజుల తర్వాత డెలివరీని పెంచుతామన్న అధికారులు.రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాలన్న సీఎం.అలాగే మత్స్యకార భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో పెట్టాలన్న సీఎం.రైతు భరోసా కేంద్రాల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండేలా చూసుకోవలని, కియోస్క్‌ లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన సీఎం.ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతికి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం.వినూత్న పద్ధతుల్లో ఆక్వా ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలో అమ్మడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి సీఎం .


    సమీక్షా సమావేశంలో  పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రి బొత్స సత్యన్నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి.