మహిళలకు కొండంత అండగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం శ్రీ వైయస్‌.జగన్


  అమరావతి: విపత్తు సమయంలో మహిళలకు కొండంత అండగా రాష్ట్ర ప్రభుత్వం


    మహిళా సంఘాలకు సున్నా వడ్డీ కింద రూ.1400 కోట్లు విడుదల.క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బటన్‌ నొక్కి ఖాతాల్లోకి సున్నా వడ్డీ కింద డబ్బును పంపిన సీఎం శ్రీ వైయస్‌.జగన్.కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న స్వయంసహాయక సంఘాల మహిళలు, కలెక్టర్లు.2016 నుంచి సున్నా వడ్డీపథకంనిలిచిపోయింది. మొట్టమొదటిగా నాన్నగారు పావలా వడ్డీకే రుణాలు అని తీసుకు వచ్చారు.రూపాయి పైచిలుకు ఉన్న రుణాలను పావలా వడ్డీకే నాన్నగారు తీసుకు వస్తే.. ఆ పథకం తర్వాత సున్నా వడ్డీగా మారింది.


    2016లో పథకాన్ని పూర్తిగా ఎత్తివేశారు.మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో వైయస్సార్‌ సున్నా వడ్డీ పథకం ప్రారంభిస్తున్నాం.అక్కచెల్లెమ్మలు అందరికీ రూ.1400 కోట్లు ఈ పధకం కింద ఇవ్వగలగులుతున్నాం.ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు.కరోనా వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, రావాల్సిన ఆదాయం రాని పరిస్థితులు ఉన్నా.. ఇలాంటి పరిస్థితుల్లోనే అక్కచెల్లెమ్మలకు ఈ పథకం తీసుకురావడం వల్ల కాస్తో కూస్తో మేలు జరుగుతుందని అనుకుంటున్నాం.


8లక్షల 78వేల గ్రూపులకు ఈ పథకం ద్వారా 91లక్షలమంది అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుంది.ప్రతి గ్రూపునకు కనీసం రూ.20వేల నుంచి రూ.40వేల వరకూ ఈపథకం వల్ల మేలు జరుగుతుంది.ప్రతి ఏటా ఈ కార్యక్రమం ద్వారా ఆమేరకు లబ్ధి పొందుతారు.కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు బ్యాంకులు రూ.3లక్షల పరిమితి వరకూ ఆరు జిల్లాల్లో 7 శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నారు.మిగిలిన 7 జిల్లాల్లో డ్వాక్రా సంఘాలకు 11 నుంచి సుమారు 13 శాతం వరకూ వడ్డీ భారం వేస్తున్నారు.సున్నా వడ్డీ అమలు చేయాలంటే 7శాతం నుంచి 13 శాతం వరకూ ఉన్న వడ్డీని ప్రభుత్వమే చెల్లించాలి.


మనం చేసే ప్రతి పథకంలోకూడా అక్కచెల్లెమ్మలకే పెద్దపీటే వేశాం.మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.ముగ్గురు మహిళా మంత్రులు ఇదే కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
డిప్యూటీ సీఎం, ఇద్దరు మంత్రులు, సీఎస్‌ స్థానాల్లో మహిళలు ఉన్నారు.82 లక్షలమంది పిల్లలకు మేలు జరిగేలా అమ్మ ఒడి పథకం.జులై 8న ఈ 27 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం.ఇళ్లపట్టాలు ఇవ్వడమే కాదు, ఉచితంగా ఇళ్లు కూడా కట్టిస్తాం.రాబోయే కాలంలో ఇంకా మంచి పనులు చేయడానికి దేవుడి దీవెనలు ఉండాలని కోరుతున్నాను.