ఏపీ లో కరోనా రాజకీయం !


     అధికార పార్టీ నేతల నిర్లక్ష్యం కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోయిందని  చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.పాలక ప్రతిపక్షాల మధ్యమాటల యుద్ధానికి దారితీస్తుంది.ఏపీ లో కరోనా రాజకీయం మితిమీరుతోంది.రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖరాసిన  చంద్రబాబు లేఖపై మండిపడిన వైసీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతుందని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్‌పై నిర్లక్ష్యపు కామెంట్లు చేసి ప్రజల్లో అయోమయాన్ని సృష్టించారని వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు భౌతిక దూరం నిబంధనలను పక్కన పెట్టి  కరోనా వైరస్ మరింత ప్రబలడానికి కారకులయ్యారని  చంద్రబాబు ఆరోపించారు.


    వైసీపీ నేతలు చంద్రబాబు లేఖపై మండిపడిన అనిల్ కుమార్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి. ఏపీలో వాస్తవ పరిస్థితులు తెలియకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబుకు మతి పోయందని అన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాను కించపరుస్తూ ఉన్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు తీవ్రమైన పదజాలంతో రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్  చంద్రబాబుపై ధ్వజమెత్తారు. జాతీయ సగటుతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉందని, డెత్ డేట్ కూడా తక్కువగానే ఉందని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.


    గవర్నర్ బంగ్లాలో కరోనా వచ్చిందంటూమాట్లాడుతున్న చంద్ర బాబుకు ,లండన్ రాజ కుటుంబీకులకు, ఏకంగా బ్రిటన్  ప్రధానమంత్రికి కరోనా వైరస్ సోకిన విషయం తెలియదా,కరోనా వైరస్ పేదవారికి వస్తుంది, గొప్ప వాళ్లకు రాదు అన్న నిబంధన ఏమీ లేదన్న విషయం చంద్రబాబుకు తెలియదా 10 శాతం మండలాలు మాత్రమే రెడ్ జోన్‌లో ఉన్నాయని,దేశంలో అత్యధికంగా రోజుకు 7000 కరోనా వైరస్ పరీక్షలు చేస్తున్న రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు. రాజకీయాలు పక్కనపెట్టి కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కృషి చేయాలని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.