ప్రధాని మోడీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్!


    భారతదేశ ప్రధానమంత్రి మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియోకాన్ఫరెన్స్ కొనసాగించారు, కరోనా నేపథ్యంలో  లాక్‌డౌన్‌ను కొనసాగించాలా వద్దా అనేది ప్రధానాంశంగా చర్చ జరిగింది.  ఈ చర్చలో దాదాపు భారతదేశ సీఎంలు  అందరూ పాల్గొన్నారు. మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్, పాల్గొన్నారు. అందరి ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నా మన ప్రధాని మోడీ మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు భరోసా ఇచ్చారు. 24 గంటలు అందుబాటులో ఉంటానని, అవసరమైన సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అందరం ఐక్యంగా  ఉండి, కరోనా కట్టడికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ తో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ మాస్క్‌లను ధరించారు.


     ఎక్కువ శాతం ముఖ్యమంత్రులు  లాక్‌డౌన్‌ను పొడిగించాలని కోరారు. కరోనా వైరస్ కట్టడికి కేంద్రం నుంచి నిత్య సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రుల కోరినట్లు సమాచారం. వ్యవసాయ, పారిశ్రామిక, రంగాలకు ఆర్థిక సహాయం అందించాలని దేశవ్యాప్తంగా ఒకే విధంగా అమలు చేయాలని కోరారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ రెడ్‌జోన్లలో మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను   అమలు చేయాలని ముఖ్యమంత్రులకు తెలిపారు. ఇటువంటి తరుణంలో లాక్‌డౌన్‌నఫై  ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోడీ ఎలా  నిర్ణయం తీసుకుంటారనేది దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. త్వరలోనే మన దేశ ప్రధాని మోడీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


     ఇప్పటివరకు కేసుల సంఖ్య 7447 చేరింది. మరణాల సంఖ్య 239 జరిగింది చేరింది. 24 గంటల్లో1035 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 40 మంది మృతి చెందారు. ఆస్పత్రులలో 6656 మంది చికిత్స పొందుతున్నారు. 640 మంది  కోలుకున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగేందుకు ఆస్కారం ఉంది. దేశం మొత్తం 720 జిల్లాలు ఉన్న 400 జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం పెద్దగా లేదు .133 జిల్లాలలో కరుణ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది .మోడీ నిర్ణయం కోసం దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు.