జనతా బజార్ల ప్రతిపాదనలపై అధికార్లతో చర్చించిన సీఎంశ్రీ వైయస్‌.జగన్!


    మన రైతులకు అందుబాటులో అతిపెద్ద స్థానిక మార్కెట్,గ్రామాలు, పట్టణాల్లో 20వేలకు పైగా వైయస్సార్‌ జనతాబజార్లు ఆ దిశగా ప్రభుత్వం అడుగులు. వైయస్సార్‌ జనతా బజార్ల ప్రతిపాదనలపై అధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ చర్చ.వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోల్డ్‌చైన్, ప్రాససింగ్‌ నెట్‌వర్క్‌ను పటిష్టం చేసేదిశగా ప్రభుత్వం అడుగులు. సంబంధించి పలు ప్రతిపాదనలను సమావేశంలో చర్చించిన సీఎం.రాష్ట్రంలో 11వేలకు పైగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి:వీటిలో వైయస్సార్‌ జనతా బజార్లు పెట్టేదిశగా ప్రయత్నాలు చేయాలి.


    వార్డు సచివాలయాల పక్కన కూడా జనతా బజార్లు రావాలి,మండల కేంద్రాల్లో పెద్ద స్థాయిలో జనతా బజార్లను ఏర్పాటు చేయాలిదాదాపుగా 22వేల జనతాబజార్లతో పెద్ద నెట్‌వర్క్‌ ఏర్పడుతుంది.ఈ బజార్లలో శీతలీకరణ యంత్రాలు పెట్టాలి.పాలు, పళ్లు, కూరగాయలు తదితర వాటిని నిల్వచేసి విక్రయానికి  అందుబాటులో పెట్టాలి.వీటివద్ద చిన్నసైజు ట్రక్కులు లేదా పికప్‌ వ్యాన్స్‌ కూడా పెట్టాలి.ప్రతి గ్రామ సచివాలయానికీ ఒక ట్రక్కు ఉండాలి.ప్రతిరోజూ జనతా బజార్లకు కూరగాయలు, పాలు, పండ్లు, గుడ్లు లాంటి సరుకులు తీసుకురావడానికి ఇవి ఉపయోగపడతాయి.


    మరోవైపు రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు అమ్ముకునే సరుకులను గోదాములకు లేదా దగ్గర్లో ఉన్న వ్యవసాయ మార్కెట్లకు తరలించేందుకూ ఈ వాహనాలు ఉపయోగపడతాయి.జనతాబజార్లకు సంబంధించి మ్యాపింగ్‌ చేయాలి.ప్రస్తుతం కరోనా నేపథ్యంలో రైతుజార్లను, మార్కెట్లను వికేంద్రీకరించారు.ప్రతి నిత్యావసర వస్తువును దాదాపుగా ప్రతిగడప వద్దకూ చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ లొకేషన్లను కూడా గుర్తించి ఆమేరకు అక్కడ కూడా జనతా బజార్లు వచ్చేలా చేయండి.లాభ, నష్టాలు లేని రీతిలో నిర్వహిస్తే, ప్రజలకు మంచి ధరల్లో నిత్యావసరాలు లభిస్తాయి.ఇదే జనతా బజార్లలో చేపలు, రొయ్యల్లాంటి ఆక్వా ఉత్పత్తులు కూడా అమ్ముడుపోతాయి.


    జనతా బజార్ల నిర్వహణను స్వయం సహాయ సంఘాలకు అప్పగించాలి,రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చే ప్రక్రియలో ఈ ప్రయత్నం మేలు చేస్తుంది.మార్కెట్లో జోక్యంచేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.తద్వారా, రైతులకు, వినియోగదారులకు మేలు జరుగుతుంది.ఇది సక్రమంగా చేయగలిగితే, అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుంది.అలాగే ప్రతి గ్రామంలోనూ కూడా గోడౌన్లు ఉండే దిశగా అడుగులు వేయాలి .గ్రామాల్లో గొప్ప మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు అవుతుంది,గ్రామాల స్వరూపాలు మారిపోతాయి.ఈ ప్రాజెక్టును అధికారులు ఓనర్‌ షిప్‌ తీసుకుని సమిష్టిగా పనిచేసి విజయవంతం అయ్యేలా చూడాలి వైయస్సార్‌ జనతాబజార్ల ప్రాజెక్టుకు ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించండి.