నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, తిక్కవరపుపాడు గ్రామంలో నూతన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, వెల్ నెస్ సెంటర్లకు శంకుస్థాపన చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలందరికీ మాస్కుల పంపిణీ కోసం గ్రామ కార్యదర్శికి మాస్కులను అందజేసిన ఎమ్మెల్యే కాకాణి.కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితుల్లో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడి పోకుండా తిరిగి ముందుకు తీసుకొని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నమన్నారు.
కరోనా నేపథ్యంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైన, ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సమర్థవంతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిది. నూతన సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం ఉప ఆరోగ్య కేంద్రాలతో గ్రామస్థులకు, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు.గ్రామాలలో అభివృద్ధి కుంటుపడకుండా సిమెంటు రోడ్లు, డ్రైన్లు మొదలగు నిర్మాణాలను చేపడుతున్నాం.
సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ కార్యక్రమాలన్ని ఇంటి ముంగిటకే చేర్చే ప్రక్రియను తీసుకొని వచ్చాము.వాలంటీర్లు సమర్థవంతంగా విధులు నిర్వహించి, వాలంటీర్ల వ్యవస్థ పై విమర్శలు చేసిన వారి నోళ్లకు తాళం వేశారు.సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతిపక్ష శాసనసభ్యునిగా గత 5 సంవత్సరాలలో చేయలేకపోయిన అభివృద్ధి కార్యక్రమాలను అధికారంలోని 5 సంవత్సరాలతో కలిపి 10 సంవత్సరాల అభివృద్ధిని అందిస్తా.2 సార్లు శాసన సభ్యునిగా అవకాశం ఇచ్చి, ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం కల్పించిన ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.