వివిధ రకాల యాప్లతో,నిర్ధారణ పరీక్షల్లో,రాష్ట్రంలో అత్యుత్తమ విధానాలు అనుసరిస్తున్నారు అంటూ కేంద్ర బృందం ప్రశంస. ఇన్ఫెక్షన్ బయటపడుతుంది అంటే ఎక్కువ టెస్టులు చేయడం వల్లే .వైరస్ ఎవరికి సోకిందో గుర్తించేందుకు ఇదే అత్యుత్తమ మార్గం.ఏపీ అధికారులు ఇచ్చిన వివరాలతో మేం చాలా సంతృప్తి చెందాం. ఇన్ని రకాల యాప్లు ఏ రాష్ట్రంలోనూ చూడలేదు.ఆంధ్రప్రదేశ్లో కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని, టెస్టుల్లో అత్యుత్తమ మార్గాలను అనుసరిస్తున్నారని కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరిశీలన కోసం కేంద్ర బృందం శుక్రవారం విజయవాడ వచ్చింది.
కోల్కతాకు చెందిన డా.మధుమితా దూబే, డా.సంజయ్ సాధూఖాన్ బృందం కర్నూలులో పర్యటించనుండగా డా.బాబీపాల్, డా.నందినీ భట్టాచార్య బృందం గుంటూరును పరిశీలించనుంది. వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.జవహర్రెడ్డితో కేంద్ర బృందం సుమారు 45 నిముషాల పాటు సమావేశమైంది. అనంతరం కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఇన్ఫెక్షన్ ఉన్న బాధితులను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మూడు దశల్లో ఇంటింటి సర్వే నిర్వహించింది.రాష్ట్రంలో కోటిమంది స్మార్ట్ఫోన్లు, మరో 1.5 కోట్ల మంది జియో ఫోన్లు వినియోగిస్తున్నారు. ఇప్పటివరకూ 48.58 లక్షల మంది ఆరోగ్యసేతు యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు ఎంఐఎస్, ఎంఎస్ఎస్, ఫార్మసీ తదితర యాప్ల ద్వారా ప్రతిఒక్కరి వివరాలూ సేకరించగలిగాం. బాధితుల వద్దకే వైద్య సిబ్బందిని పంపి వివరాలు గోప్యంగా ఉంచుతున్నాం. కంటైన్మెంట్ ప్రాంతాల్లో 255 ఫీవర్ క్లినిక్స్ ఏర్పాటు చేశాం రాష్ట్రంలో 90 టెస్టులు చేసే స్థాయినుంచి 10 వేల పరీక్షలు చేసే స్థాయికి ఎదిగాం ట్రూనాట్, ఆర్టీపీసీఆర్, క్లియా మెషీన్స్ ద్వారా టెస్టులు చేస్తున్నాం. క్లియా టెస్టులు దేశంలో ఏపీలో మాత్రమే జరుగుతున్నాయి.
రాష్ట్రంలో పాజిటివ్ బాధితుల్లో 80 శాతం మంది ఎసింప్టమాటిక్ (ఎలాంటి లక్షణాలు లేని) వారే ఉన్నారు. ఎక్కువ టెస్టులు చేయడం వల్ల వారిని గుర్తించగలిగాంనెట్వర్క్ ట్రాన్స్మిషన్ ఎనాలసిస్ (ఒక కేసు ఎలా వచ్చింది? ఎలా వ్యాపించింది?)లో భాగంగా సూపర్ స్ప్రెడర్స్ను గుర్తించాం.
కేంద్ర బృందం - చాలా బాగుంది, ఆంధ్రప్రదేశ్లో కరోనా నిర్ధారణ పరీక్షలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. టెస్టుల్లో మంచి ప్రతిభ కనపరిచారు.
నిర్ధారణ పరీక్షలు అత్యధికంగా చేస్తున్న నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి.
రాష్ట్రంలో ఐటీ సేవలు చాలా బాగున్నాయ్. మరింత మందికి వీటిని విస్తరించాలి.
సాధారణంగా లక్షణాలున్న వారికే టెస్టులు చేయలేని పరిస్థితుల్లో 80 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్ ఉందని గుర్తించడం గొప్ప విషయం.