విశాఖపట్నంలో పర్యటించనున్నమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


      విజయవాడ నుంచి విశాఖకు బయలుదేరిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.మధ్యాహ్నం విశాఖకు చేరుకోనున్న మంత్రి గౌతమ్ రెడ్డి.12.30గం.లకు ఎల్ జీ పాలిమర్స్ పరిశ్రమ , స్థానిక గ్రామాలు,ప్రజల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించనున్న మంత్రి మేకపాటి. 1 గం.కు ఎల్ జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ పరిశీలన అనంతరం అక్కడే మీడియాతో సమావేశం.నిన్న రాత్రి వరకూ ఫ్యాక్టరీలో లీకేజ్ కట్టడి, బాధితుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అధికారులతో ఆరా, 1.30 గం.లకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్న మేకపాటి.


    విశాఖ ప్రమాదంతో పరిశ్రమల శాఖను,  అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి.ఇప్పటికే ఉష్ణోగ్రతల వల్ల ప్రభావితం చెందే పరిశ్రమల జాబితాను తెప్పించుకున్న మేకపాటి.ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పరిశ్రమల శాఖకు ఆదేశం.సాయం చేస్తున్న అధికారులకు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులకు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపిన మంత్రి.


     మధ్యాహ్నం 2గం.లకు ఆస్పత్రి ప్రాంగణంలో అధికార యంత్రాంగంతో, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్, జిల్లాలోని ఇతర ఫ్యాక్టరీలు, పారిశ్రామిక జోన్ లు, పరిశ్రమల పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్న మంత్రి గౌతమ్ రెడ్డి. వేసవి కాలం, ఉష్ణోగ్రతల మార్పుకు అనుగుణంగా పట్టణ పరిధిలో ఉన్న పరిశ్రమలు, స్థానిక ప్రజల రక్షణకై ఎలా వ్యవహరించాలన్నదానిపై అధికారులతో చర్చ.తాజా దుర్ఘటన నేపథ్యంలో మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.