2017–18 ఆర్థిక ఏడాదికి సంబంధించి కాగ్‌ నివేదిక!


    2017–18 ఆర్థిక ఏడాదికి సంబంధించి పలు అంశాలపై కాగ్‌ నివేదిక బుధవారం (జూన్‌ 17,2020) విడుదలైంది.బాబు అవినీతి,ఆర్థిక నిర్వహణ, దుబారా లను కడిగిపారేసిన కాగ్అ,ప్పులు చేసి దుబారా,17–18లో 231 రోజులు చేబదుళ్లు (వేస్‌ అండ్‌ మీన్స్‌), ఓవర్‌ డ్రాఫ్ట్‌లే.ఆర్థిక నిర్వహణలో టీడీపీ సర్కార్‌ తీరును ఏకిపారేసిన కాగ్.అప్పులు తెచ్చినా దుబారా చేయడం వల్ల టీడీపీ సర్కార్‌ రాష్ట్రాన్ని ఆర్థికంగా చావుదెబ్బ తీసిందని కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక తేల్చింది.18 మార్చి నాటికి అప్పులు రూ. 2,23,706 కోట్లకు పెరిగాయని, ఆ మేరకు ఆస్తుల కల్పనలో ఘోరంగా విఫలమైందని స్పష్టం చేసింది.


    చేసిన అప్పులు చాలక, రిజర్వు బ్యాంకు నుంచి 231 రోజులు చేబదులుగా, ఓవర్‌ డ్రాఫ్ట్‌ రూపంలో రూ. 45,860.75 కోట్లు తీసుకొని, వాటిని సకాలంలో చెల్లించకపోవడం వల్ల రూ. 44.31 కోట్లను వడ్డీగా చెల్లించిందంటూ ఎత్తి చూపింది.ఆర్థిక నిర్వహణలో టీడీపీ సర్కారు వైఫల్యానికి ఇదో తార్కాణమని కాగ్‌ పేర్కొంది.బుధవారం శాసనసభకు నివేదిక ఇచ్చింది,2015–16 నుంచి 2017–18 మధ్య కాలంలో ద్రవ్యలోటును అదుపు చేయడంలో విఫలం.అప్పులు చేసి ఆస్తులు కల్పించాల్సిన సర్కారు అందుకు భిన్నంగా వ్యవహరించింది. దుబారా ఖర్చులు చేసి, అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేసింది. దీనివల్ల మార్చి 2018 నాటికి భారం రూ. 2,23,706 కోట్లకు పెరిగింది.


    తీసుకున్న రుణాలతో పోలిస్తే తిరిగి చెల్లించాల్సిన రుణాల నిష్పత్తి 2016–17లో 18.27 శాతం నుంచి 2017–18లో 22.51 శాతానికి పెరిగింది.కొత్తగా చేసిన అప్పులను పాత అప్పులు తీర్చడం కోసం మళ్లించారు. దీనివల్ల రాబోయే ఏడేళ్లలో తీర్చాల్సిన రుణం రూ. 91,599.32 కోట్లకు పెరిగింది.రెవెన్యూ కేటాయింపులు,కేపిటల్‌ కేటాయింపులు సరిగా జరగలేదు.17-18 సంవ‌త్స‌రంలో బ‌డ్జెట్‌లో మొత్తం అన్ని శాఖలకు కేటాయించిన నిధుల కంటే రూ. 34,602.10 కోట్లు త‌క్కువ ఖ‌ర్చు చేశారు.రూ. 230. కోట్లకుపైగా గ్రామీణాభివృద్ధి సెస్‌ నిధులూ మాయం.


     గత సర్కారు హయాంలో రూ. 180.32 కోట్లు ఖర్చు పెట్టి 352 కిమీ మేర గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపడతామని ప్రకటించి కేటాయించిన నిధులలో 99.50 శాతం (రూ.179.41 వెచ్చించి కేవలం 250 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశారని కాగ్‌ తప్పుబట్టింది. వైఫల్యానికి కారణాలు కూడా వెల్లడించలేదని నివేదికలో పేర్కొంది.ఏపీలో గ్రామీణాభివృద్ధి చట్టం – 1996 సెక్షన్‌ 7 ప్రకారం గత ఏడాదిలో వసూలు చేసిన గ్రామీణాభివృద్ధి నిధికి బదలాయించాలి. 2016–17 ఆర్థిక ఏడాదిలో రూ. 552.41 కోట్లు సెస్‌ రూపంలో వసూలైనప్పటికికీ గ్రామీణాభివృద్ధి నిధికి కేవలం రూ. 322.36 కోట్లు మాత్రమే బదలాయించారు.రూ. 230.05 మేర నిధులను తక్కువగా బదలాయించారు.