విక్రమ సింహపురి యూనివర్సిటీ జాతీయ సేవా పథకం సేవలు అభిదందానియం జాయింట్ కలెక్టర్


    కరోనా వైరస్ దెబ్బకు ప్రజా జీవితం లాక్ డౌన్ ఆయెనవేళ, బీద ప్రజలు ఆకలికి అలమటిస్తుంటే విక్రమ సింహపురి యూనివర్సిటీ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో సేవలు అభినందియం. ఎంతో మందికి ఆహారం, బియ్యం, మాస్కులు, కూరగాయలు అందించి సహాయం మరవలేనిది రక్తం నిల్వలు లేకుండా ఉన్నపుడు  రక్తం దానం చేసి ఏంతో మంది ప్రాణాలను నిలబెట్టిన  విక్రమ సింహపురి యూనివర్సిటీ జాతీయ సేవా పథకం సేవలు గొప్పవి.



    విక్రమ సింహపురి యూనివర్సిటీ జాతీయ సేవా పథకం సేవలు అభిదందానియం, జాయింట్ కలెక్టర్. 
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ  సేవా పథకం సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం కు  ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భముగా  కోవిద్-19 విపత్కర పరిస్థితులలో రక్తదాన శిబిరాన్నీ ఏర్పాటు చేసి సుమారు 50 యూనిట్స్ రక్తాన్ని సేకరించినందుకు జాయింట్ కలెక్టర్ డా. ఎన్ . ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. 



     లాక్ డౌన్ సమయం లో రక్త నిల్వలు తరించుకో పోతున్న తరుణంలో, ఎంతమంది ముందుకు వచ్చి వారివంతు సాయంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఎంతోమంది రక్తదాతలను ప్రోత్సహించి రక్తదానం చేయించి నందుకు సుమారు 12 మంది ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఈ రోజు రెడ్ క్రాస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో  హెల్ప్ ది నీది సభ్యులు పార్థసారధి, రాజేష్, చైతన్య, అఖిల్ మరియు హరీష్ పాల్గొన్నారు. రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడి, అమూల్యమైన సేవలు అందించినందుకు  డా. ఉదయ్ శంకర్ ను రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ పి చంద్రశేఖర్ రెడ్డి గారు, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారు, రిజిస్ట్రార్ డా. యల్ . విజయ కృష్ణా రెడ్డి గారు మరియు పలువురు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.


    విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ  సేవా పథకం సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం గారు   జాయింట్ కలెక్టర్ డా. ఎన్ . ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రత్యేక ప్రశంసాపత్రాన్నిఅందుకున్న శుభ సందర్బముగా ఇంకా అనేక సేవలతో అనేక అవార్డులు రావాలని కోరుకుంటూ ప్రజల తరుపున స్ప్రెడ్ న్యూస్ పాఠకుల తరుపున అభినందిస్తున్నాము.