కోవిడ్ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్,పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్.వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి తదితరులు.ఆంధ్రప్రేదేశ్ సీఎం 25లక్షలకు పైగా పరీక్షలు చేశాం,ప్రతి పదిలక్షలమందికీ 47,459 మందికి పరీక్షలు చేశాం.మరణాలు రేటు 0.89శాతం గా ఉంది.క్లస్టర్లలోనే 85 శాతం నుంచి 90శాతం వరకూ పరీక్షలు చేస్తున్నాం.
సాధ్యమైనంత త్వరగా పాజిటివ్ కేసులను గుర్తిస్తున్నాం.సాధ్యమైనంత త్వరగా పాజిటివ్ కేసులను గుర్తిస్తున్నాం.వైద్య సదుపాయం అందించడమే కాకుండా, ఐసోలేషన్ చేస్తున్నాం.కోవిడ్ వచ్చేనాటికి వైరాలజీ ల్యాబ్ కూడా లేదు.ఇప్పుడు ప్రతి పదిలక్షలమందికి 47వేలకుపైగా పరీక్షలు చేస్తున్నాం.ప్రతి జిల్లాల్లో ల్యాబ్లు ఉన్నాయి.టెస్టుల విషయంలో స్వాలంబన సాధించాం.దాదాపు 2 లక్షలమంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కోవిడ్ నివారణా చర్యల్లో పాల్గొంటున్నారు.అవసరమైన వారికి అందరికీ టెస్టులు చేస్తున్నాం.ప్రతిరోజూ 9వేల నుంచి 10వేల కేసులు నమోదువతున్నాయి.
138 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కోవిడ్ ఆస్పత్రులుగా వినియోగిస్తున్నాం.138 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కోవిడ్ ఆస్పత్రులుగా వినియోగిస్తున్నాం.09 కోవిడ్కేర్ సెంటర్లు ఉన్నాయి, 56వేలకుపైగా బెడ్లు ఉన్నాయి.గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిబెడ్లు కేవలం 3286 మాత్రమే ఉండేవి.ప్రస్తుతం 11వేలకుపైగా ఉన్నాయి.గడచిన మూడు నెలల్లో దాదాపు 7వేలకు పైగా బెడ్లు సమకూర్చుకున్నాం.అలాగే హెల్ప్ డెస్క్లను పెట్టాం.
పేషెంట్లను త్వరగా అడ్మిచేయించడానికి వీరు సహాయపడుతున్నారుప్రతి మండలంలో 108 అంబులెన్స్ ఉన్నాయి.కోవిడ్కు ముందు 108 అంబులెన్సులు 443 ఉంటే, కోవిడ్ సమయంలో మరో 768 అంబులెన్స్లు సమకూర్చుకున్నాం.108, 104లు కలిపి కొత్తగా 1088పైగా తీసుకొచ్చాం .పొరుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మహా నగరాలు మాకు లేవు, ఆ నగరాల్లో ఉన్నట్టుగా భారీ మౌలికసదుపాయాలు ఉన్న ఆస్పత్రులూ లేవు.రాష్ట్రంలో వైద్యసదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం.