30 వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యం ముఖ్యమంత్రి జగన్‌


     spread news;-  కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం, కొప్పర్తి ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌పై అధికారులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యం. కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి 7 ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయన్న అధికారులు. స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంపై ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించి తదుపరి ఒక సంస్థను ఎంపిక చేస్తామన్న అధికారులు.అందుకు కనీసం 7 వారాల సమయం పడుతుందన్న అధికారులు.


    ఆప్రక్రియ పూర్తి కాగానే తదుపరి 3–4 నాలుగు వారాల్లో పనులు ప్రారంభిస్తామన్నఅధికారులు ప్రతిపాదనలు స్వీకరించిన వెంటనే ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలన్నసీఎం. పనులు కూడా వేగంగా జరిగేలా చూడాలన్న ముఖ్యమంత్రి.కంపెనీల ప్రతిపాదనల స్వీకరణకు ముందు ప్రభుత్వ పరంగా ఏమైనా పనులు మిగిలి ఉంటే వాటిని నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి. కరువు పీడిత ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ది, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్టీల్‌ప్లాంట్‌ను తీసుకొస్తున్నామని,ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనులు ప్రారంభం కావాలని ఆదేశించిన ముఖ్యమంత్రి. 


     కడప నగరానికి సమీపంలో కొప్పర్తి వద్ద ఏర్పాటవుతున్న  ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌పై సమీక్ష చేసిన సీఎం.  క్లస్టర్‌ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను వివరించిన అధికారులు. రూ.300 కోట్ల పెట్టుబడితో ఉద్యోగాల కల్పనకు డిక్సన్‌ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందన్న అధికారులు.ఆ పెట్టుబడి మరింత పెంచే అవకాశం ఉందన్న అధికారులు. డిక్సన్‌తో పాటు మరిన్ని కంపెనీలు కూడా పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయన్న అధికారులు.


 పెట్టుబడులను ఆకర్షించేలా చక్కటి ప్రమాణాలతో కొప్పర్తి ఈఎంసీని తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి.
– కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యం కావాలన్న సీఎం.సమావేశంలో పాల్గొన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఇండస్ట్రియల్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌, ఇతర ఉన్నతాధికారులు.