హార్టికల్చర్‌, మైక్రో ఇరిగేషన్, అగ్రి ఇన్‌ఫ్రాలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

   


నిర్ణీత కాలంలోగా చిన్న, సన్నకారు రైతులు అందరికీ కూడా డ్రిప్, స్పింక్లర్‌ సదుపాయాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలన్న సీఎం.దీనివల్ల చిన్న, సన్నకారు రైతులందరికీ డ్రిప్,స్ప్రింక్లర్‌ సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించినట్టు అవుతుంది సీఎం.చిన్న సన్నకారు రైతులకు ఎలాగూ బోర్లు వేయిస్తున్నాం కాబట్టి, వారికి సూక్ష్మసేద్యం సదుపాయాలను ఇచ్చినట్లైతే మంచి ఫలితాలు వస్తాయి సీఎం.కొందరికి మాత్రమే పథకాలు ఉండకూడదని, అందరికీ అందాలన్న సీఎంవ్యవస్ధలో అవినీతి ఉండకూడదుసీఎం.

      సన్నకారు రైతులకు ఎలా మేలు చేయాలన్న దానిపై ఒక కార్యాచరణ ఉండాలి,రాయలసీమ, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో 10 ఎకరాల్లోపు, మిగిలిన చోట్ల 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్‌ సదుపాయాల్లో ప్రాముఖ్యత ఇవ్వాలని అధికారులకు సీఎం సూచన. దీనిపై పూర్తిస్థాయిలో ఆలోచనలు చేసి కార్యాచరణ రూపొందించాలన్న ముఖ్యమంత్రి సూక్ష్మసేద్యం సదుపాయాలను రివర్స్‌టెండరింగ్‌ ద్వారా కొనుగోలు చేయడంద్వారా రేటు తగ్గుతుందని, దీనివల్ల ఎక్కువ మంది రైతులకు అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశం ఉంటుందన్న సీఎం.

     కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాయితీలను పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే.. ఎంత రేటులో డ్రిప్, స్ప్రింక్లర్‌ వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయన్నదానిపై ఒక అవగాహన వస్తుందన్న సీఎం.డ్రై స్టోరేజీ, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ ఫాం, గోడౌన్లు, హార్టికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రైమరీ ప్రాససింగ్‌ సెంటర్లు, యంత్రపరికరాలు, ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లు, ఇ–మార్కెటింగ్, జనతాబజార్లు, ప్రైమరీ ప్రాససింగ్‌ యూనిట్లు తదితర సదుపాయాలుకోసం రూ.14,562 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.