మన ఊరును మనమే పరిశుభ్రంగా చేసుకుందాం అన్న నినాదంతోజగనన్న స్వచ్ఛ సంకల్పం

     


 క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌. జగనన్న స్వచ్ఛ సంకల్పం, కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్‌ జయంతి రోజు, జూలై 8న ప్రారంభం.గ్రామాల్లో ఎక్కడా మురుగునీరు కనిపించకూడదు. ముఖ్యంగా మురికి వాడల్లో ఆ సమస్య ఎక్కువగా ఉంటుంది.సీవేజ్‌ పంపింగ్‌ ఎలా ఉంది? ఆ నీటిని ఎలా డిస్పోస్‌ చేయడం ఎలా అన్నది చూడండి.ఆ మురుగునీటిని ఎక్కడ పడితే అక్కడికి తరలించొద్దు. ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లో వేయాలి. అలాగే సాలిడ్‌ వేస్ట్‌ను కూడా కాల్చి వదిలేయకుండా, ఏం చేయాలన్న దానిపై ఆలోచన చేయండి. ఎస్‌ఓపీ రూపొందించండి.పారిశుద్ధ్య కార్మికులకు ఎక్కడా ఏ లోపం లేకుండా అన్నీ సమకూర్చాలి.గ్రామాల్లో చెత్త సేకరణకు కానీ, ఇంకా దేనికైనా రుసుము వసూలు చేస్తే, సేవల్లో ఎక్కడా లోపం ఉండకూడదు. 

    ‘మన ఊరును మనమే పరిశుభ్రంగా చేసుకుందాం’ అన్న నినాదంతో పనులు, కార్యక్రమాలు చేపట్టాలి.చెత్త సేకరణ కోసం సేకరించే ఈ–వాహనాల (ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌) నిర్వహణ భారం కాకుండా చూసుకోండి.గ్రామాల్లో శానిటేషన్, డ్రింకింగ్‌ వాటర్, వీధి దీపాలు.. ఈ మూడింటిపైనే ఎక్కువ వ్యయం చేయాలి. వాటికే అత్యధిక ప్రాధాన్యం.క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’ కార్యక్రమంలో గ్రామాలు, పట్టణాలలో పూర్తి పారిశుద్ధ్యం కోసం మున్సిపల్‌ విభాగం కూడా పంచాయతీరాజ్‌తో కలిసి పని చేయాలి.వైయస్సార్‌ జలకళ:ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల బోర్లు వేయాలని నిర్ణయం. చిన్న, మధ్య తరహా రైతులకు 1.5 లక్షల పంప్‌సెట్లు ఇవ్వాలని నిర్ణయం.

     దీని ద్వారా 3 లక్షల రైతులు ప్రయోజనం పొందుతారని అంచనా. 5 లక్షల ఎకరాలను సాగు నీరు అందుతుందని లెక్క.బోర్‌ వేయాలని ఏ రైతు దరఖాస్తు చేసినా, ఎప్పుడు ఆ బోర్‌ వేస్తామన్నది స్పష్టంగా చెప్పాలి. అందు కోసం ఎస్‌ఓపీ ఖరారు చేయండి.ఇచ్చిన తేదీన కచ్చితంగా బోరు వేయాలి. ఆ తేదీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్‌ కాకూడదు.

తేదీ ఇస్తున్నామంటే, కేవలం బోరు వేయడం మాత్రమే కాదు. నీరు పడిన తర్వాత కచ్చితంగా నెల రోజుల లోపు, విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చి, పంప్‌సెట్‌ బిగించాలి.ప్రతి నియోజకవర్గంలో నెలకు కనీసం 20 బోర్లు వేయాలి. అది మీ టార్గెట్‌.

    వీధి దీపాలు ఎల్‌ఈడీ వాడకం వల్ల ఏటా దాదాపు రూ.160 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది.దాదాపు 4 లక్షల లైట్లు కావాలి. ఆ మేరకు కార్యాచరణ సిద్దం చేయండిఏపీ రూరల్‌ రోడ్‌ కనెక్టివిటీ ప్రాజెక్టు (ఏపీఆర్‌ఆర్‌పీ) – ఈఏపీ30 ఏళ్లుగా 30 వేల కి.మీ. బీటీ రోడ్లు మాత్రమే ఉండగా, మనం అధికారంలోకి వచ్చాక 10 వేల కి.మీ రహదారుల నిర్మాణం జరుగుతోంది.క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పర్యావరణ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ గిరిజాశంకర్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్, మున్సిపల్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మితో పాటు, పలువురు అధికారులు పాల్గొన్నారు.