జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు డివిజన్ బెంచ్ కౌంటింగ్ జరపొద్దని హైకోర్టు ఆదేశించింది. సింగిల్ జడ్జి వద్దకు వెళ్లి పిటిషన్ను పరిష్కరించుకోవాలని ధర్మాసనం సూచించింది దీంతో ఏప్రిల్ 8న యథావిధిగా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేని డివిజన్ బెంచ్ కొట్టివేసింది.ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్లో ఎస్ఈసీ సవాల్ చేసిన విషయం తెలిసిందే.అర్ధరాత్రి పిటిషన్ను హైకోర్టు పరిశీలనలోకి తీసుకుంది.పిటిషన్ వేసిన వర్ల రామయ్య ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కాదని, వ్యక్తిగత హోదాలో వేసిన పిటిషన్ను సింగిల్ బెంచ్ కొట్టేసి ఉండాల్సిందని పేర్కొంది. నాలుగు వారాలు కోడ్ ఉండాలని నిబంధన లేదని ఎస్ఈసీ తెలిపింది. ఎస్ఈసీ తరఫున సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించగా, పిటిషనర్ వర్ల రామయ్య తరపున సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలను వినిపించారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు డివిజన్ బెంచ్ కౌంటింగ్ జరపొద్దని హైకోర్టు ఆదేశించింది. సింగిల్ జడ్జి వద్దకు వెళ్లి పిటిషన్ను పరిష్కరించుకోవాలని ధర్మాసనం సూచించింది దీంతో ఏప్రిల్ 8న యథావిధిగా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేని డివిజన్ బెంచ్ కొట్టివేసింది.ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్లో ఎస్ఈసీ సవాల్ చేసిన విషయం తెలిసిందే.అర్ధరాత్రి పిటిషన్ను హైకోర్టు పరిశీలనలోకి తీసుకుంది.పిటిషన్ వేసిన వర్ల రామయ్య ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి కాదని, వ్యక్తిగత హోదాలో వేసిన పిటిషన్ను సింగిల్ బెంచ్ కొట్టేసి ఉండాల్సిందని పేర్కొంది. నాలుగు వారాలు కోడ్ ఉండాలని నిబంధన లేదని ఎస్ఈసీ తెలిపింది. ఎస్ఈసీ తరఫున సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించగా, పిటిషనర్ వర్ల రామయ్య తరపున సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలను వినిపించారు.