ఆంధ్రప్రదేశ్ లో25 వేల కోట్లతో పెట్రో కెమికల్ కారిడార్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
spread news(న్యూఢిల్లీ);- ఆంధ్రప్రదేశ్ లో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సుముఖం, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.రూ.25 వేల కోట్లతో పెట్రో కెమికల్ కారిడార్.వ్యవస్థాపక నిర్మాణాల దృష్ట్యా సమగ్ర ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు స్థాపనకు కేంద్రం ముందడుగు.పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్మిస్తే 50 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు.రానున్న 2,3 ఏళ్లలో పెట్రో కెమికల్ రంగంలో పెట్టుబడుల ప్రవాహం.ఈస్ట్ కోస్ట్ కారిడార్ లో రూ. 25 నుంచి 30 వేల కోట్ల పెట్టుబడులు.
ఫీడ్ స్టాప్ బయట నుంచి రావాలి, ప్లాస్టిక్ లో 25 రకాల పాలిమర్స్ ఉన్నాయి.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అనుబంధ పరిశ్రమలు కలుపుకొని మరో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం.ఎట్టి పరిస్థితుల్లో పెట్రో కెమికల్ ప్రాజెక్టు పూర్తికి కేంద్రం నుంచి పూర్తి సహకారానికి అంగీకారం.ఇటీవల పెట్రోల్ లో ఇథనాల్ వినియోగం 10 శాతం నుంచి 20 శాతానికి పెంచిన కేంద్ర ప్రభుత్వం.
తద్వారా రాబోయే రోజుల్లో ఇథనాల్ రంగంలో మరిన్ని పెట్టుబడులు.రిఫైనరీ సామర్థ్యం పెంచాలనుకోవడం, మొలాసిస్ ఉత్పత్తి ఎక్కువగా చక్కెర కర్మాగారాల ద్వారా వస్తున్నదాని ద్వారా ఇథనాల్ గా మార్చడం కోసం ప్రత్యేకంగా రూ.1000 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీకి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్.ఎంవోయూల గురించి చెప్పలేదు. కేవలం గ్రౌండ్ అయినవి మాత్రమే ఓపెన్ గాప్రకటించాం.కోవిడ్ విపత్తులోనూ 45,000 ఉపాధి అవకాశాలు సృష్టించడం చిన్న విషయం కాదు.ఢిల్లీలోని శాస్త్రిభవన్ లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి