ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి

వైఎస్‌ఆర్‌ బీమాపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమీక్ష

     


SPREADNEWS(అమరావతి);- కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు, ఆ కుటుంబాన్ని సత్వరమే ఆదుకునేలా వైయస్సార్‌ బీమాలో మార్పులు చేర్పులు.క్లెయిముల పరిష్కారంలో చిక్కులకు స్వస్తిచెప్పాలని నిర్ణయం.వైయస్సార్‌ బీమాపై సమీక్ష సందర్బంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ కీలక నిర్ణయాలుమరణించిన వ్యక్తి కుటుంబానికి నేరుగా  రాష్ట్ర ప్రభుత్వం సహాయం.కుటుంబంలో సంపాదిస్తున్న వ్యక్తి అయి ఉండి 18 నుంచి 50ఏళ్ల మధ్య వయస్సు 

     వారు సహజంగా మరణిస్తే.. వారి కుటుంబానికి రూ. 1లక్ష ఆర్థిక సహాయం.అదే సంపాదించే వ్యక్తి, 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్నవారు ప్రమాదవశాత్తూమరణిస్తే రూ. 5లక్షల ఆర్థిక సహాయం.జులై 1  నుంచి కొత్తమార్పులతో వైయస్సార్‌బీమా అమలు .ఈలోగా సంపాదించే వ్యక్తుల మరణాలకు సంబంధించిన వారి క్లెయిములను పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం.జులై 1లోగా ఈ క్లెములన్నింటినీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.

     రైతుల మరణాలు, ప్రమాదవశాత్తూ మత్స్యకారులు మరణించినా, పాడిపశువులుమరణించినా తదితర వాటికి ఇచ్చే బీమా పరిహారాలన్నీకూడా దరఖాస్తు అందిన నెలరోజుల్లోగా చెల్లించాలని సీఎం ఆదేశం.దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశం.ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే వైయస్సార్‌ బీమా పథకం కింద పరిహారాన్ని చెల్లించాలని సీఎం నిర్ణయం..