SPREAD NEWS(అమరావతి);-థర్డ్ వేవ్ వస్తుందన్న సమాచారం నేపధ్యంలో సన్నద్ధంగా ఉండాలి.విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్ సూపర్ కేర్ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సూచన.పోలీస్ బెటాలియన్స్లో కూడా కోవిడ్ కేర్ ఎక్విప్మెంట్ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించాలి.కమ్యూనిటీ ఆస్పత్రులు స్ధాయివరకు ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.పీహెచ్సీల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలి.
సబ్సెంటర్ల వరకు టెలీమెడిసిన్ సేవలు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉండాలి.అప్పుడే వారితో పీహెచ్సీల వైద్యులు కూడా వీసీ ద్వారా అందుబాటులోకి వస్తారు.కోవిడ్ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్ కర్ఫ్యూ కొనసాగించాలి.రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలి.జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయి,సీఎం శ్రీ వైయస్.జగన్.
50 పడకలు దాటి ఉన్న ప్రతి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు విషయంలో పురోగతిని అడిగి తెలుసుకున్న సీఎం.జిల్లా కలెక్టర్లు సంబంధిత జిల్లాల్లో ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు ఇచ్చారన్న అధికారులుఈ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ఇన్సెంటివ్ ఇస్తున్నామని స్పష్టం చేసిన సీఎం.