SPREAD NEWS(అమరావతి);-బీచ్కారిడార్, మల్టీలెవర్ కార్పార్కింగ్, నేచురల్ హిస్టరీ పార్క్, మరియు మ్యూజియం, బీచ్ కారిడార్ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష.టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం సమీక్షనిర్దేశించుకున్న షెడ్యూలు ప్రకారం టిడ్కోఇళ్లు పూర్తికావాలన్న సీఎం.అదే సమయంలో మౌలిక సదుపాయాల కల్పనపైనా దృష్టిపెట్టాలన్న సీఎం.
మొదటివిడతలో భాగంగా చేపట్టిన 38 లొకేషన్లలో 85,888 ఇళ్లలో సుమారు 45వేలకుపైగా ఇళ్లు మూడు నెలల్లోగా, మిగిలిన ఇళ్లు డిసెంబర్లోగా అప్పగిస్తామన్న అధికారులు.
లబ్ధిదారులకు ఇళ్లుఅప్పగించేటప్పుడు పూర్తిగా అన్నిరకాల వసతులతో ఇవ్వాలన్న సీఎం.మౌలికసదుసాయాలు విషయంలో రాజీ పడొద్దన్న సీఎం.వైయస్సార్ అర్బన్క్లినిక్స్ నిర్మాణంపైనా సీఎం సమీక్ష.విజయవాడ, గుంటూరు, నెల్లూరుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని సీఎం ఆదేశం.గత ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్టులను అసంపూర్తిగా విడిచిపెట్టారని సమావేశంలో ప్రస్తావన.
మూడు ప్రాంతాల్లో ట్రీట్మెంట్ప్లాంట్లకు పొల్యూషన్ కంట్రోల్బోర్డు సిఫార్సులులేకపోతే నదులు కలుషితం అవుతున్నాయని ఆందోళన.ఈ నేపథ్యంలో మూడు చోట్ల వెంటనే ట్రీట్ మెంట్ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలుమంగళగిరి – తాడేపల్లి, మాచర్ల, కర్నూలులో ట్రీట్మెంట్ప్లాంట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం.