SPREAD NEWS;-(అమరావతి);- మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయన్న డీజీపీ.సాయుధ మావోయిస్టుల బలం సుమారు 50కి పరిమితమైందన్న డీజీపీ.ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకే పరిమితమైందన్న డీజీపీ.ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు గిరిజనుల జీవితాలపై విశేష ప్రభావం చూపుతున్నాయన్న డీజీపీ
గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా వారి గడప వద్దకే సేవలు అందుతున్నాయన్న డీజీపీ.ప్రభుత్వం మంజూరుచేసిన ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అతిపెద్ద కార్యక్రమమని, దీనిపట్ల గిరిజనులు సంతోషంగా ఉన్నారని వెల్లడించిన డీజీపీ.మావోయిస్టుల రిక్రూట్మెంట్ పట్ల గిరిజన యువకులు ఆసక్తి చూపడంలేదన్న డీజీపీ.ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలే దీనికి ప్రధాన కారణమన్న డీజీపీ.
ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పాముల పుష్పశ్రీవాణి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, ప్రిన్స్పల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎన్ ప్రతీప్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ట ద్వివేది,ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.