ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాల మధ్య సమస్యలను అధికారులతోచర్చలు.

రేపు భువనేశ్వర్‌ వెళ్లనున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌

ఉభయరాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై రేపు సాయంత్రం ఒడిశా సీఎం శ్రీ నవీన్‌ పట్నాయక్‌తో చర్చలు.

     


SPREAD NEWS;-వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం అంశాన్ని ఒడిశా సీఎంతో రేపు జరిగే చర్చల్లో ప్రస్తావించనున్న ఏపీ సీఎం.నేరడి బ్యారేజీ కారణంగా ఉభయ రాష్ట్రాలకూ కలగనున్న ప్రయోజనాలను వివరించనున్న సీఎం.బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా వైపునుంచి 103 ఎకరాలు అవసరమని ఇందులో 67 ఎకరాలు రివర్‌బెడ్‌ ప్రాంతమేనన్న అధికారులు.బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశావైపు కూడా సుమారు 5–6 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరు అందుతుందని తెలిపిన అధికారులు.

     జంఝావతి ప్రాజెక్టు అంశాన్ని రేపటి సమావేశంలో ప్రస్తావించనున్న సీఎం. ప్రస్తుతం రబ్బర్‌ డ్యాం ఆధారంగా సాగునీరు ఇస్తున్నామని తెలిపిన అధికారులు.24,640 ఎకరాల్లో కేవలం 5 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నామని తెలిపిన అధికారులు.ప్రాజెక్టు పూర్తిచేస్తే రైతులకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని తెలిపిన అధికారులు. ప్రాజెక్టును పూర్తిచేస్తే ఒడిశాలో 4 గ్రామాలు పూర్తిగా, పాక్షికంగా 6 గ్రామాలు ముంపునకు గురవుతాయని తెలిపిన అధికారులు.

    కొఠియా గ్రామాల వివాదానికి సంబంధించిన మొత్తం వివరాలను సీఎం ముందు ఉంచిన అధికారులు. 21 గ్రామాల్లో 16 గ్రామాలు ఏపీతోనే ఉంటామంటూ తీర్మానాలు చేసి ఇచ్చారని సీఎంకు వివరించిన విజయనగరం జిల్లా కలెక్టర్‌ సూర్యకుమారి.ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించామని సమావేశంలో పేర్కొన్న అధికారులు. కొఠియా గ్రామాల్లో దాదాపు 87శాతానికి పైగా గిరిజనులు ఉన్నారని, వారికి సేవలు అందించే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని సమావేశంలో ప్రస్తావించిన అధికారులు.

ఈ సమావేశంలో సీఎస్‌ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, జలవనరులశాఖ ఈఎన్‌సి సి నారాయణరెడ్డి, విజయనగరం జిల్లా కలెక్టర్‌ ఎ సూర్య కుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.